టీడీపీ దాడిలో గాయపడ్డ ఎమ్మార్వో పరిస్థితి విషమం


అనంతపురం: టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ గుడిబండ ఎమ్మార్వో వేణుగోపాల్ పరిస్థితి విషమంగా ఉంది.  తాము చెప్పినా రేషన్ డీలర్ను మార్చలేదన్న కారణంతో ఆ ఎమ్మార్వో పై టీడీపీ కార్యకర్తలు డిసెంబర్ నెల చివర్లో దాడి చేశారు.  ఆ దాడితో తీవ్రంగా గాయపడిన ఎమ్మార్వో కోమాలోకి వెళ్లారు. అనంతరం వేణుగోపాల్ ను ఖరీదైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.


 


హైదరాబాద్ లో ఆస్పత్రి ఛార్జీలు అధికం కావడంతో ఆ ఖర్చులను భరించలేని కారణంగా ఎమ్మార్వో కుటుంబం అనంతపురానికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.  దీనిపై క్యాష్ లెస్ వైద్యం అందించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఏపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top