ఎంపీడీవో కార్యాలయం ముట్టడి


కర్నూలు: 2014-15 సంవత్సరానికి గాను ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కర్నూలు జిల్లా తుగ్గలిలోని ఎంపీడీవో కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top