ఎంపీ కొత్తపల్లి గీతను నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేతలు


విజయనగరం: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, పార్టీ వల్ల గెలవలేదని చెప్పడం ఎంతవరకు న్యాయం’’ అంటూ వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీతను పార్టీ నేతలు, కార్యకర్తలు నిలదీశారు. ఈ ఘటన అరకు లోక్‌సభ పరిధిలోని విజయనగరం జిల్లా కురుపాంలో శుక్రవారం జరిగింది. అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షా సమావేశానికి గీత హాజరయ్యారు. దీనికి అధికారులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు ఎస్.పద్మావతి, ఎంపీపీ, కార్యకర్తలు హాజరయ్యారు.


 


ఈ సందర్భంగానే ఎంపీ గీత వ్యవహార శైలిపై నేతలు, కార్యకర్తలు నిలదీశారు. దీంతో గీత దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎలాంటి బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఎంపీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top