ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మృతులు బాపట్ల మండలం చెరువు జమ్ముల పాలెం గ్రామానికి చెందిన నాగ వర్తులమ్మగా గుర్తించారు. అత్త, ఆడపడచు వేధింపులే కారణమని ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొంది.