తల్లీ కూతుళ్ల ఆత్మహత్య


కర్నూలు : ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలం షరీన్‌నగర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... షరీన్‌నగర్‌ కాలనీలోని రాములవారి దేవాలయం ముందు వీధిలో నివాసముంటున్న సుబ్బలక్ష్మి(39).. తన కూతుళ్లు వైష్ణవి(18 ), ఉదయభవాని(13)లతోపాటు సోమవారం అర్ధరాత్రి దాటాక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.



ఆమె భర్త ప్రియా పచ్చళ్ల ఏజెన్సీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ఇంట్లో లేని సమయంలో వీళ్లు ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top