చిత్తూరు జిల్లాలో విషాదం
సదుం: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సదుం మండలం కురవపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి అనంతరం తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో భర్త, అత్తింటివారు వేదింపులకు పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక తల్లి తన ఇద్దరు పిల్లలు వైష్ణవి(6), వర్షిణి(1)లకు విషం ఇచ్చి తనూ తాగింది. ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. తల్లి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. శనివారం ఉదయం వెలుగుచూసిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.