'వాజ్పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు'

'వాజ్పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు' - Sakshi


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు పొడుస్తోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బుధవారం విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు సామాన్యుడిపై భారం మోపుతున్నాయని రఘువీరారెడ్డి ఆ పార్టీలపై మండిపడ్డారు.


బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. మోదీ సర్కారు దొంగచాటుగా మూడు దఫాలుగా పన్నులు పెంచి ప్రజలను దోపిడి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని చంద్రబాబు సర్కారు ప్రశ్నించకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతామనడం అన్యాయమన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top