మైనింగ్ లీజు రద్దు చేసినా అనుమతులెవరిచ్చారు?
విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలపై ఎమ్మెల్సీ శర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. బాక్సైట్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో కొన్ని వాస్తవాలు వెల్లడించలేదన్నారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మైనింగ్ లీజు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అనుమతులు ఎవరిచ్చారని అందులో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు వైఖరి ఎందుకు మారిందో చెప్పాలన్నారు.