రైతు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
రుణ భారంతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పరామర్శించారు. కర్నూలు జిల్లా గడివేములలో దూదేకుల ఇస్మాయిల్ అనే రైతు కుటుంబాన్ని ఆమె కలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందేలా అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతు కుటుంబానికి తన వంతుగా సాయంగా రూ.5వేలు అందించారు.