పూలు కోసి ఎమ్మెల్యే నిరసన
మంగళగిరి: ఏపీ రాజధాని ప్రాంతంలో రెండో పంట వేయొద్దని ప్రభుత్వం ప్రకటించడం పై వైఎస్ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నిరసన తెలిపారు. గురువారం ఆయన పంట పొలాల్లో పూలు కోసి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కురగల్లు, నిడమర్రు, పెనమాక, ఉండవల్లి గ్రామాల్లోని పంటపొలాల్లో రైతులతో కలసి పర్యటించారు. ఆయన వెంట మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్న కుమారి, వైఎస్సార్సీపీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.