ఎమ్మెల్యేను ప్రశ్నించాడని వేధింపులు!

ఎమ్మెల్యేను ప్రశ్నించాడని వేధింపులు! - Sakshi


విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పనితీరుపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజవర్గానికి చెందిన ఓ యువకుడి తాజా ఫేస్‌బుక్ పోస్టు ఇందుకు నిదర్శణంగా కనిపిస్తోంది. ఓ యువకుడు నియోజకవర్గ సమస్యలపై ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యేను నిలదీశాడు. ఆ సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.


యువకుడికి మద్దతుగా మెసేజ్‌లు రావడాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వర్గం జీర్ణించుకోలేకపోయింది. బోండా ఉమా అభిమానులమన్న పేరుతో యువకుడికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతు చూస్తామంటూ కొందరు, అసభ్య పదజాలంతో మరికొందరు ఆ యువకుడిని వేధింపులకు గురిచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top