ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం!


నెల్లూరు: సూళ్లూరుపేటలో జరిగిన జన్మభూమి సభలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. తొలుత సభను నిర్వహించడానికి టిడిపి మాజీ ఎమ్మెల్యే వెంకటరత్నం వేదికపైకి వచ్చారు. అందుకు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సంజీవయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.



ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రొటోకాల్ పాటించాలని సంజీవయ్య అధికారులను ఆదేశించారు. దాంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

***

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top