విద్యార్థినిపై గ్యాంగ్ రేప్


ఈపూరు (గుంటూరు) : బాలికపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోడేపుడివారిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన  బాలిక (16) వినుకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15 న పాఠశాల నుంచి బస్సులో తిరిగి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు పుస్తకాలు కొనిస్తానని బైక్ పై తీసుకెళ్లాడు.అతని మాటలు నమ్మిన విద్యార్థిని బైక్ ఎక్కింది.



ఆ తర్వాత అతను వాహనాన్ని ఎక్కడా ఆపకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో తన ఇద్దరు మిత్రులు గోపి, మరియబాబులను కూడా తీసుకొని వెళ్లాడు. అటవీ ప్రాంతంలో బాలిక పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆమెను తీసుకొచ్చి బస్టాండ్‌లో వదిలేశాడు. ఈ విషయాన్ని బాలిక గుంటూరులో ఉండే తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదివారం రాత్రి ఈపూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top