చినబాబు పిలిచారని..

చినబాబు పిలిచారని.. - Sakshi


హడావుడిగా హైదరాబాద్ వెళ్లొచ్చిన ‘గంటా’

 

విశాఖపట్నం: నారా లోకేష్ సమావేశానికి హాజరుకావాలని పిలుపు రావడంతో మంత్రి గంటా ఆగమేఘాలపై శనివారం రాజధానికి వెళ్లి రావడంతో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో లోకేష్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అంశంపై మంత్రులు, ఇతర ముఖ్యనేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు హాజరయ్యారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడి నిశ్చితార్థ వేడుకల్లో బిజిగా ఉండడంతో  హాజరు కాలేదు. విజయనగరం జిల్లా కొండపల్లి మండలంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉన్న మంత్రి గంటా మాత్రం ఫోన్‌కాల్ రాగానే హైదరాబాద్ పయనమయ్యారు.



ప్రత్యేక కేబినెట్ సమావేశంలో పాల్గొని సాయంత్రం తిరిగి విశాఖకు చేరుకున్నారు. తర్వాత ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి విశాఖ ఉత్సవాల్లో పాల్గొన్నారు. విషయం ఏంటని ఆరా తీయగా స్మార్ట్ విలేజ్ పథకంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం మంత్రులతో చినబాబు సమీక్షించారని సమాచారం. ఏ హోదాలో చినబాబు కేబినెట్ మంత్రులతో ఈ భేటీ నిర్వహించారో వెళ్లొచ్చిన మంత్రులకే తెలియాలని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top