'అధికారుల కంటే టీడీపీ కార్యకర్తలే పవర్ ఫుల్'
శ్రీకాకుళం: ప్రభుత్వ అధికారుల కంటే టీడీపీ కార్యకర్తలే పవర్ ఫుల్ అని కార్మిక శాఖ మంత్రి కింజెరపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మినీ మహానాడు సందర్భంగా శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అధికారులు పని చేయటం కాదు.. టీడీపీ కార్యకర్తలు ఏది చెబితే అదే ప్రభుత్వంలో జరుగుతుందన్నారు. ప్రభుత్వ అధికారుల కంటే టీడీపీ కార్యకర్తలే పవర్ ఫుల్ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారికే కలెక్టర్లు పింఛన్లు అందజేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.