ప్రభుత్వ ధాన్యం తాకట్టుపెట్టి కోటిన్నర లోన్


కామవరపు కోట (పశ్చిమగోదావరి) : ప్రభుత్వ ధాన్యాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఓ మిల్లు యాజమాని రూ.1.5 కోట్ల అప్పు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడిలోని శ్రీనివాస రైసు మిల్లులో ప్రభుత్వం ధాన్యాన్ని నిల్వ ఉంచింది. అయితే ఇదే అదనుగా భావించిన మిల్లు యాజమాని ఆ ధాన్యాన్ని తాకట్టు పెట్టి కోటిన్నర అప్పు తీసుకున్నాడు. కాగా ఈ విషయం శుక్రవారం వెలుగు చూడటంతో అప్రమత్తమైన రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top