పది మంది వైద్యులకు శ్రీముఖాలు
గుంటూరు క్రైమ్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన పది మంది వైద్యులకు ప్రభుత్వం గురువారం జార్జి మెమోలు జారీ చేసింది. వ్యక్తిగతంగా నర్సింగ్హోంలు నడుపుతూ.. విధులకు సరిగ్గా హాజరు కాకపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. దీనిపై వైద్యుల నుంచి వివరణ కోరుతూ డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జార్జి మెమోలు జారీ చేశారు. వీటిని అందుకున్న వారిలో సుధీర్బాబు, ఎ.కవిత, సి.పద్మావతి, పి.చంద్రశేఖర్రావు, వి.ఎ.ఎ.లక్ష్మి, వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ జి.శైలబాల, బి.సుబ్బారావు, బి.వి.పార్వతీశ్వరరావు, పి.యశోధర, ఉదయశంకర్ ఉన్నారు.