వైఎస్ జగన్ కు ఏపీ వీఆర్ఏ అసోసియేషన్ వినతిపత్రం
హైదరాబాద్:తమను ఫుల్ టైమ్ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు పే స్కేలు అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ రాష్ట్ర వీఆర్ఏ అసోసియేషన్ సభ్యులు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ వినతిపత్రం సమర్పించారు.
ఈ మేరకు వైఎస్ జగన్ ను సోమవారం లోటస్ పాండ్ లో కలిసిన వీఆర్ఏ అసోసియేషన్ సభ్యులు.. తమ సమస్యలపై ఏపీ సర్కార్ పై ఒత్తిడి తేవాలని విన్నవించారు.