రైతు కుటుంబానికి రూ.75వేల సాయం


గుడ్లూరు(ప్రకాశం): ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చించురెడ్డిపాలెం గ్రామంలో వారం క్రితం బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే పోతుల రామారావు రూ.75వేల సాయం అందజేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రైతు బోయిన ఎలీషా ఈ నెల 2వ తేదీన అప్పుల బాధతో ప్రాణాలు తీసుకున్నాడు.



బుధవారం రాత్రి ఆ కుటుంబాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఎంపీ మేకపాటి రూ.50 వేలు, ఎమ్మెల్యే రామారావు రూ.25వేలను సాయంగా అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top