విదేశాంగ అధికారితో మేకపాటి భేటీ
నెల్లూరు: వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమ్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో విదేశాంగ అధికారి రూపా గంగూలీని కలిశారు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు అదృశ్యంపై చర్చించారు. మస్తాన్ బాబు ఆచూకీ కోసం అర్జెంటీనా, చిలీ దేశాల్లో హెలికాప్టర్లతో గాలిస్తామని రూపా గంగూలీ.. మేకపాటితో చెప్పారు.
కాగా, మస్తాన్ బాబు ఆచూకీ కోసం ఆయన కుటుంబం రాష్ట్ర ప్రభుత్వాన్ని సాయం కోరింది.