రేపట్నుంచి మెడికల్ అడ్మిషన్ కౌన్సిలింగ్!


హైదరాబాద్: మెడికల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ను శనివారం నుంచి నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 

 

ఈ మెడికల్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 5 తేది వరకు కొనసాగుతుందని తెలిపారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో మెడికల్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. 

 

శనివారం మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరిలో 1 నుంచి 1500 ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top