మట్కా నిర్వాహకులు అరెస్ట్
యలనూర్(అనంతపురం): మట్కా నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యలనూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలో మట్కా నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 49,950 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు