నేడు ఏపీకి 'రాజధాని మాస్టర్ ప్లాన్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం సోమవారం ఏపీ సర్కార్కు అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ మంత్రి మాస్టర్ ప్లాన్ అందించనున్నారు. మ.3.30 గంటలకు వీరిద్దరు మాస్టర్ ప్లాన్ వివరాలు తెలియజేయనున్నారు. మొత్తం 219 చదరపు కి.మీ నగర పరిధిలోని ప్లాన్ను సింగపూర్ తయారు చేసింది.
కాగా, భూముల ఇచ్చిన రైతులకు సమీప గ్రామాల్లో భూముల కేటాయించనున్నారు. మాస్టర్ ప్లాన్ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇక మాస్లర్ ప్లాన్ అందజేసిన తర్వాత ఏపీ సర్కార్ ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది.