వివాహిత అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో 30 ఏళ్ల వయసున్న ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు 10 రోజుల క్రితమే సుభాష్ నగర్కు వచ్చి ఓ గుడిసెలో నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తల పేర్లు తెలియాల్సి ఉంది. కాగా భర్త పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.