భార్యాభర్తలపై పోలీసుల అరాచకం
హైదరాబాద్: గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. ఓ మహిళపై కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దుశ్చర్యను అడ్డుకున్న భర్తపై మరో పది మంది పోలీసులు దురుసగా ప్రవర్తించారు. అతడిని చితకబాదారు.
బాధితులు పోలీసు స్టేషన్ను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. భార్యాభర్తలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసేందుకు సీఐ శరత్ బాబు నిరాకరించారు. అంతేగాక, ఎదురు కేసు పెడతానంటూ బాధితులను హెచ్చరించారు.