మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
వై రామవరం : తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన డొంకరాయి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం భారీ డంప్ బయటపడింది. అటవీప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న యాంటీ నక్సల్ స్క్వాడ్ దళాలకు డంప్ లభ్యమైనట్లు సమాచారం. అందులో పేలుడు పదార్ధాల తయారీలో వాడే అమోనియం నైట్రేట్, రాకెట్ లాంచర్ల తయారీలో వాడే సామగ్రి పెద్ద ఎత్తున ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాకినాడ హెడ్క్వార్టర్కు తరలించనట్టు తెలుస్తోంది