ఏవోబీలో కాల్పులు.. మావోయిస్టు మృతి


ఒడిశా: భద్రాతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందడంతో పాటు ఓ గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని నారాయణపట్నం లల్లేరి అటవీప్రాంతంలో బుధవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

 

మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై మావోలు కాల్పులు జరపడంతో.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందగా, ఓ గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన గిరజనుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top