కుప్పంలో వ్యక్తి హత్య
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుడ్లనాయినిపల్లె గ్రామ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తిని చంపి పెట్రోలు పోసి కాల్చి చంపారు. ముఖం గుర్తు పట్టని విధంగా తయారైంది. శనివారం ఉదయం అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించటంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు.పోలీసులుకేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(కుప్పం)
సంబంధిత వార్తలు