వృద్ధుడి అదృశ్యం
వజ్రపుకొత్తూరు: ఉదయం నడకకు వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఎం.కామేశ్వరరావు(60) ఆదివారం ఉదయం సముద్రం ఒడ్డున కాలినడకన బయలు దేరాడు. సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు తీరప్రాంతం, చుట్టుపక్కలంలా రెండు రోజుల పాటు వెదికారు. ఆచూకీ తెలియకపోవటంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.