పిండి రుబ్బుతుంటే.. నరికి చంపేశాడు!
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో పిండి రుబ్బుకుంటున్న మహిళపై ఓ వ్యక్తి గొడ్డలితో విరుచుకుపడ్డాడు. అత్యంత దారుణంగా ఆమెను నరికి చంపాడు. చీరాల పట్టణం వడ్డే నాగేశ్వరరావు బజారుకు చెందిన మల్లిక అనే మహిళ తన ఇంట్లో పిండి రుబ్బుకుంటున్న సమయంలో ఓ దుండగుడు చొరబడ్డాడు.
వెనుక నుంచి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో మల్లిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దాడి చేసిన వ్యక్తి వెంకటేశ్వర్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .