మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరి మృతి


అనంతపురం: జిల్లా లోని ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామం సమీపంలోని చెరువులో మట్టి తవ్వుతుండగా ప్రమాదవశాత్తూ పెళ్లలు విరిగి పడటంతో నారా కొండల నాయుడు (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృత దేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

(ధర్మవరం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top