రైలు ఢీకొని ఒకరి మృతి
విజయనగరం: సీతానగరం మండలం చినగోగిల వద్ద విశాఖపట్నం నుంచి రాయగఢ్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వేపోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైలు కిందపడటంతో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జవడంతో గుర్తుపట్టని విధంగా తయారైంది.