రైలు ఢీకొని ఒకరి మృతి


విజయనగరం: సీతానగరం మండలం చినగోగిల వద్ద విశాఖపట్నం నుంచి రాయగఢ్ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వేపోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైలు కిందపడటంతో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జవడంతో గుర్తుపట్టని విధంగా తయారైంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top