భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
చిలమత్తూరు (అనంతపురం జిల్లా) : భర్తతో గొడప పడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కేంద్రంలో జరిగింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కలాం(30) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
కాగా భార్యతో గొడవ పడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య మళ్లీ తిరిగి రాదేమోనన్న అనుమానంతో మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.