మూత్ర విసర్జన చేశాడని కొట్టి చంపాడు....

మూత్ర విసర్జన చేశాడని కొట్టి చంపాడు.... - Sakshi


కర్నూలు : కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హోతూరులో దారుణం జరిగింది.  నాలుగేళ్ల చిన్నారిని  ఇంటి యజమాని కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ ఇంటి ఆవరణలో మూత్ర విసర్జన చేశాడనే కోపంతో ఇంటి యజమాని చిన్న తిప్పన్న ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. బాలుడి తల్లిదండ్రుల ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే చిన్న తిప్పన్న, గంగాధర్ కుటుంబాలు పక్క పక్కనే నివాసం ఉంటున్నాయి. అయితే వీరి ఇరు కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి.



ఈ నేపథ్యంలో గంగాధర్ కుమారుడు వినోద్ ....చిన్నకుట్టి ఇంటి ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అతడు ఆగ్రహంతో వినోద్ చెంపమీద బలంగా కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


దాంతో తల్లిదండ్రులు వినోద్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.  చిన్న పిల్లాడు తెలియక చేసిన పొరపాటు చేశాడని, దీనిపై ప్రాణాలు తీయటం సరికాదని, మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top