ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోరుతూ మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. విశాఖ జిల్లాలోని దేవరాపల్లిలో శుక్రవారం దేవుడినాయుడు అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ నడిరోడ్డుపై ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
ఈ ఘటనను చూసిన స్థానికులు దేవుడినాయుడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం దేవుడినాయుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.