ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం


విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోరుతూ మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. విశాఖ జిల్లాలోని దేవరాపల్లిలో శుక్రవారం దేవుడినాయుడు అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ నడిరోడ్డుపై ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. 


ఈ ఘటనను చూసిన స్థానికులు దేవుడినాయుడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం దేవుడినాయుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top