మూలవిరాట్ విగ్రహం ధ్వంసం


నకరికల్లు(గుంటూరు): మండల కేంద్రంలోని కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలోని మూలవిరాట్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం రాత్రి ఆలయ పూజారి దీపారాధన చేసి మెయిన్ గేటుకు తాళాలు వేసి వెళ్లారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు వచ్చి చూసేసరికి విగ్రహం ధ్వంసమై కనిపించింది.  దుండగులు కేవలం విగ్రహం మాత్రమే ధ్వంసం చేశారు తప్ప విలువైన వస్తువుల జోలికి మాత్రం పోలేదు.


 


గుప్త నిధుల కోసం ఈ పని చేసి ఉండవచ్చునని స్థానికులు అనుకుంటున్నారు. 2 సంవత్సరాల క్రితం కొండ కింద ఉన్న ఊయల పల్లకి వద్ద కూడా గుప్తనిథుల కోసం తవ్వకాలు జరగటంతో ఆ కోణంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top