5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా

5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా - Sakshi


ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డిసెంబర్ 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు.



ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విశాఖపట్నంలో ఆయన ఆవిష్కరించారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యార్థి, మైనార్టీ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top