శ్రీవారి భక్తులకు లక్కీ చాన్స్


సాక్షి, తిరుమల: సామాన్య భక్తులు అరుదైన సేవల్లో స్వామివారిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. నాలుగేళ్ల ముందు ప్రారంభించిన ఈ లక్కీడిప్ మార్చి కోటాను గురువారం విడుదల చేశారు. ఇందులో తోమాల సేవ 41 టికెట్లు (ఒక్కొక్కరికి రూ.220), అర్చన 129 (రూ.220), మేల్‌ఛాట్‌వస్త్రం 9 (దంపతులు రూ.12,250), పూర్ణాభిషేకం 46 (రూ.750) టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముందు రోజు తిరుమలలోని విజయా బ్యాంకులో లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top