బడ్జెట్లో కేటాయింపులన్నీ తక్కువే: వైఎస్ జగన్

వైఎస్ జగన్మోహన రెడ్డి - Sakshi


హైదరాబాద్: బడ్జెట్లో కేటాయింపులన్నీ తక్కువే చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడటానికి సమయం ఇవ్వలేదని తెలిపారు. ఆరు రోజులు జరుగవలసిన అసెంబ్లీ సమావేశాలను 4 రోజులకు తగ్గించారని చెప్పారు. శాసనసభలో బడ్జెట్పై మాట్లాడటానికి ప్రతిపక్షానికి గంటన్నర మాత్రమే సమయం  ఇస్తామన్నారని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నాయకుడు రెండున్నర గంటలు మాట్లాడినట్లు గుర్తు చేశారు. సభలో ఎంతసేపటికీ రాజశేఖర రెడ్డిని తిట్టడం తప్ప మరొకటి లేదన్నారు. అయినా ఓపిక పట్టినట్లు తెలిపారు.



వైఎస్ జగన్ తెలిపినవాటిలో ముఖ్యమైన అంశాలు:



* ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగంలో తెలిపిన ప్రకారం వ్యవసాయ రుణాలు 56 వేల కోట్ల రూపాయలను బ్యాంకులు రీషెడ్యూల్ చేయడానికి అంగీకరించాయి.

* వ్యవసాయ రుణాలు కనీసం 50 వేల కోట్ల రూపాయలు.  డ్వాక్రా రుణాలు 14 వేల కోట్ల రూపాయలు.

మొత్తం కావలసినది 64వేల  కోట్ల రూపాయలు.


* 4 శాతం వడ్డీ చొప్పున  రెండు వేల 560 కోట్ల రూపాయలు కావాలి.  బడ్జెట్లో కేటాయించినది 599 కోట్ల రూపాయలు  మాత్రమే.

* ప్రస్తుతం 43 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారు. అయిదు నెలలకు లెక్కిస్తే 650 కోట్ల రూపాయలు కావాలి. కానీ 130 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.

* ఫీజు రీయింబర్స్మెంట్కు  2013-14లో 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 9 లక్షల దరఖాస్తులకు మంజూరు చేశారు.



* 14 లక్షల 54వేల  వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. గంటకు 5.25 యూనిట్ల విద్యుత్  కావాలి. కనీసం 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే 26.25 యూనిట్లు కావాలి. అంటే మొత్తం 7875 యూనిట్లు కావాలి.యూనిట్కు 4 రూపాయల చొప్పున కొనుగోలు రేటు వేసుకుంటే 4 వేల500 కోట్లు రూపాయలు కావాలి. కేటాయింపులు ఆ స్థాయిలో లేవు. అంటే కనీసం ఏడు గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు.



* కొత్త పిఆర్సి కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. దానిపై ఎటువంటి ప్రకటనలేదు. 3.58 లక్షల పెన్షనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది.

* వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు.  87 వేల 612 కోట్ల రూపాయలు కావాలి. బడ్జెట్లో 5వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.

* ప్రతి రైతు 12వేల రూపాయల వడ్డీ చెల్లించాలి. ఆ ప్రస్తావనలేదు.

* డ్వాక్రా మహిళల రుణాలు 14 వేల204 కోట్ల రూపాయలు ఉన్నాయి.

*ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడ్జెట్లో ఆ ప్రస్తావనలేదు. కోటి 50 లక్షల ఇళ్లు ఉన్నాయి.  మూడు వేల కోట్ల రూపాయలు  కావాలి.

* బిసిలకు  పది వేల కోట్ల రూపాయలతో  ప్రత్యేక బడ్జెట్ అన్నారు. 993 కోట్ల రూపాయలు  మాత్రమే కేటాయించారు.

* వెయ్యి కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేవు.

*వ్యవసాయ బడ్జెట్లో  వ్యవసాయ ధరల స్థిరీకరణ లేదు.

* చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో నిధి అన్నారు. బడ్జెట్లో ప్రస్తావనలేదు.

* చేనేత కార్మికులకు 300 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి. కేటాయింపులు లేవు.

* కాపుల సంక్షేమ నిధికి వెయ్యి కోట్లు అన్నారు. 300 కోట్లు రూపాయలు కేటాయించారు.

* బ్రాహ్మణలుకు 25 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.

* పది లక్షల ఇళ్లు కావాలి. 15వేల కోట్ల రూపాయలు కేటాయించాలి. 808 కోట్లు మాత్రమే కేటాయించారు.

* రెండు రూపాయలకు 20 లీటర్ల నీరు అన్నారు. 5వేల గ్రామాలకు ఇస్తామన్నారు. కనీసం 250 కోట్ల రూపాయలు కావాలి. 5 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top