బంగాళాఖాతంలో అల్పపీడనం!


విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతవరణం కేంద్ర తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడు పైనే ఉంటుందని వాతావరణ అధికారులు స్పష్టం చేయగా, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ఒంగోలుపై ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


 


సోమ, మంగళవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని వాతవరణ కేంద్ర పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top