గుట్టూరులో తాగుబోతుల వీరంగం


అనంత‌పురం(పెనుకొండ‌): జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరులో బుధ‌వారం సాయంత్రం తాగుబోతులు వీరంగం సృష్టించారు. మ‌ద్యం మ‌త్తులో విచ‌క్ష‌ణ కోల్పోయిన‌ ర‌వికుమార్ అనే వ్య‌క్తి ఆదిశేషు అనే మ‌రో వ్య‌క్తిని క‌త్తితో గొంతు కోశాడు. ఈ ఘటనలో అత‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.



బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం. అయితే దాడిచేసిన ఆదిశేషును అదుపులోకి తీసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top