భ్రమల్లో పెడుతున్న బాబు
-
టీడీపీ సర్కారుపై తమ్మినేని సీతారాం ధ్వజం
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆదివారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
అధికారం చేపట్టిన ఏడెనిమిది నెలల కాలంలో దావోస్, సింగపూర్, జపాన్ దేశాలను పర్యటించిన సీఎం ఆ పర్యటనల కారణంగా రాష్ట్రానికి రప్పించిన విదేశీ పెట్టుబడులేమిటో శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, రూ.254 ఉండాల్సిన యూరియా బస్తాను తెల్లవారుజామున నుంచి క్యూలో నిలబడి రూ.370- 420లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని న్నారు.
బాబు అట్టహాసాలకు పోతూ స్మార్ట్గా ప్రజలను మోసగిస్తున్నారని సీతారాం ధ్వజమెత్తారు. బిల్గేట్స్ తనను కలిసేందుకు పడిగాపులు పడాల్సి వచ్చిందన్నట్టు చంద్రబాబు ప్రచారం కల్పించుకోవడాన్ని తమ్మినేని తప్పుపట్టారు.బాబు అపాయింట్మెంట్ ఇవ్వనందునే అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈయన్ను కలవలేదేమోనని ఎద్దేవా చేశారు.