‘పచ్చ చట్టమే’ చుట్టం!

‘పచ్చ చట్టమే’ చుట్టం! - Sakshi

  • కర్నూలు జిల్లాలో పోలీసుల ప్రతాపం

  •  అధికార పార్టీ సేవలో నిబంధనలకు తిలోదకాలు

  •  ప్రతిపక్ష నేతలను అణగదొక్కడానికి, కేసుల్లో ఇరికించడానికీ ప్రయత్నాలు

  •  అధికార పార్టీ నేతల అరెస్టుపై మీనమేషాలు..

  •  సాక్షి, కర్నూలు: చట్టాలను నిష్పక్షపాతంగా అమ లు చేయాల్సిన పోలీసు యంత్రాంగం కర్నూలు జిల్లాలో అధికార పార్టీ అక్రమ సేవలో చట్టవిరుద్ధంగా, న్యాయబాహ్యంగా, అధర్మంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో మసలుతూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బం ది పెట్టడానికి చట్టాలను తుంగలో తొక్కుతోంది. చట్టాలను అతిక్రమించినప్పటికీ అధికార పార్టీకి చెందిన వారైతే పోలీసులే వారికి చుట్టాలై కంటికి రెప్పలా కాపాడుతున్నారు.



    చట్టాలు తమ చేతుల్లోకి తీసుకున్న అధికార పార్టీకి చెందిన వారిపై కేసులు పెట్టడానికి సైతం పోలీసులు వెనుకాడటమే కాకుండా వారి కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న వైనం సర్వత్రా విస్మ యం కలిగిస్తోంది. అదే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారైతే వారిని వేధించడానికి, దారుణంగా అణగదొక్కడానికి, కేసుల్లో ఇరికించడానికీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కర్నూలులో గత కొద్ది రోజు లుగా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ వారి వైఖరిలో మార్పు రావడం లేదు.



    న్యాయస్థానం ఆదేశించినప్పటికీ విచారణ పేరు తో సాగదీస్తున్నారే తప్ప అధికార పార్టీ నేతలను అదుపులోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నేతల ఒత్తిళ్ల మధ్య జిల్లాలో కొద్ది రోజులుగా ‘పచ్చ చట్టమే’ చెల్లుబాటవుతోంది. గత నెల 31వ తేదీన నం ద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన సంఘటనపై ఆగమేఘాల మీద ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టి అరెస్టు చేసిన పోలీసులు.. అదే సంఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచనపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ మీనమేషాలు లెక్కించడం వెనుక అధికార పార్టీ పెద్దల ఆదేశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫిర్యాదులు ఉండీ కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోకపోగా ఆ నేతలు యధేచ్చగా జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భాల్లో పోలీసులు వారికి కట్టుదిట్టమైన బందోబస్తు కల్పించడం విస్మయం కలిగిస్తోంది.

     

    కౌన్సిల్ మీట్‌కు భారీ భద్రత..



    తాజాగా నంద్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసెంబ్లీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసి.. ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ శుక్రవారం రాత్రి మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆయన ఆదేశాల మేరకు ఆ ప్రాంతాన్ని పోలీ సులు అధీనంలోకి తీసుకున్నారు. కౌన్సిలర్లు, మీడియా ప్రతినిధులు, అధికారులు మినహా ఇతరులు సమావేశంలోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. నలుగురు సీఐలు, పదిమంది ఎస్‌ఐలు దాదాపు 100 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డు లు, మహిళా కానిస్టేబుళ్లు, ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు నియమించారు. గత నెల 31వ తేదీన మున్సిపల్ సమావేశంలో ఘర్షణల కు కారకులైన వారిని అరెస్ట్ చేయకుండానే మున్సిపల్ సమావేశానికి బందోబస్తును ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.  

     

    నాన్ బెయిలబుల్ కేసులే అయినా..




    మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, దేశం సులోచనతో పాటు ఇతర టీడీపీ నేతలపై గత మున్సిపల్ కౌన్సిల్ ఘటనకు సంబంధించి నాన్-బెయిలబుల్ కేసులే నమోదయ్యాయి. శిల్పా మోహన్‌రెడ్డి, దేశం సులోచన, దేశం సుధాకర్ రెడ్డి, అమృతరాజు, పెదకండిగ సుబ్రమణ్యం, రంగాప్రసాద్, కష్ణ మోహన్ మరియు ఇతరులపై ఈ నెల 18వ తేదీన....సెక్షన్లు 120 (బి), 324, 307 ఆర్/డబ్ల్యు 34 ఐపీసీ మరియు సెక్షన్ 156(3) సీఆర్‌పీసీ కింద కేసులను నమోదు చేశారు. మరో కేసులో (227/14) దేశం సులోచన, వెంకట సుబ్బయ్య, గొల్ల లక్ష్మీనారాయణ, జాకీర్ హుస్సేన్, తెలుగు కష్ణమోహన్, అమీర్ బాషాలపై సెక్షన్లు...323, 354, 427, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు.



    ఇందులో 354, అట్రాసిటీ కేసులు... రెండూ కూడా నాన్-బెయిలబుల్ కేసులే. తెలుగు కృష్ణమోహన్‌పై నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటు కూడా ఉంది. అయినప్పటికీ వారికి వత్తాసు పలికేవిధంగా పోలీసుల చర్యలు ఉన్నాయి. కేసులో ఉన్న శిల్పామోహన్‌రెడ్డి ఈ నెల 22న బెంగళూరు నుంచి నంద్యాలకు రావడం, పురపాలక సంఘం చైర్-పర్సన్, టీడీపీ నేత దేశం సులోచన కూడా అదే రోజు జరిగిన స్వచ్ఛభారత్ లో పాల్గొన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు.

     

    దర్జాగా తిరుగుతున్న టీడీపీ నేతలు




    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులే టీడీపీ నేతలపై నమోదైనా.. టీడీపీవారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. జెడ్పీ చైర్మన్, తెలుగుదేశం నేత మల్లెల రాజశేఖర్ ఏకంగా కల్తీ మద్యం కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి పక్కా ఆధారాలున్నా అరెస్టుకు పోలీసులు వెనుకాడుతున్నారు. అంతేకాదు ఏకంగా సీఎం చంద్రబాబు నుంచే తనకు అభయం ఉందని ఆయన చెప్పుకొంటూ తిరుగుతున్నారు. కలెక్టరేట్‌లో గత శనివారం నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో ఆయన కలెక్టర్ పక్కనే కూర్చున్న సంగతి తెలిసిందే.



    జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ రాంపుల్లయ్యయాదవ్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నేతలు.. అది సాధ్యంగాకపోవడంతో ఆయన ఆ సంఘం డెరైక్టర్ ను కిడ్నాప్  నాటకానికి తెర తీశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను రాంపుల్లయ్యే కిడ్నాప్ చేశారంటూ ఆయన ఇంట్లో లేని సమయంలో శుక్రవారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. ఈ విధంగా అధికార పార్టీ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top