చంద్రబాబుతో ఎంపీ గీత భేటీ

చంద్రబాబుతో ఎంపీ గీత భేటీ - Sakshi


సాక్షి, హైదరాబాద్:  విశాఖ జిల్లా అరకు నియోజవకర్గ లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. టీడీపీపీ నేత వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి) వెంట ఆమె చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఎంపీ గీత ‘సాక్షి’తో మాట్లాడుతూ తన నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉందని, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో సమీక్షించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానికంగా పరిష్కరించాల్సిన అంశాలకు సంబంధించి తొమ్మిది పేజీల వినతిపత్రాన్ని తయారు చేసి ముఖ్యమంత్రికి అందచేశానని చెప్పారు.


 


ఇదిలావుంటే కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి, మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా కేశవరెడ్డిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు.


(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top