అర్ధరాత్రి ప్రయాణీకుల పడిగాపులు..
గుంటూరు: గుంటూరు: కోమిట్ల ట్రావెల్స్కు చెందిన బస్సు బుధవారం అర్ధరాత్రి రోడ్డుపై నిలిచిపోయింది. విశాఖ నుంచి బెంగళూరు బయలు దేరిన బస్సు నీల్బోల్టులు విరిగిపోయి విజయవాడ దాటాక నాగుర్జున యూనివర్సీటీ సమీపంలో ఆగిపోయింది. దీంతో ప్రయాణీకులు అర్ధరాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు పడాల్సి వచ్చింది.
ట్రావెల్స్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ట్రావెల్స్ యాజమన్యం స్పందించడం లేదని ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.