ఏపీ మంత్రులతో కేరళ మంత్రి భేటీ
అమరావతి: ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావులతో కేరళ మంత్రి తిలోత్తం గురువారం భేటీ అయ్యారు. మంత్రులు మాట్లాడుతూ.. కేరళకు అవసరమైన జయ బియ్యం సరఫరాపై చర్చించామని తెలిపారు. కేరళ రాష్ట్రం ప్రస్తుతం ఆహార ఉత్పత్తి సమస్యలో ఉందని తెలిపారు. ఏపీలో జయ బియ్యం ఉత్పత్తి బాగా ఉందన్నారు.
త్వరలో ఓనమ్ పండుగ ఉండటంతో 70 వేల టన్నుల బియ్యం సరఫరా చేయాలని కేరళ మంత్రి కోరారని, ధర విషయంలో ఇంకా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ధర నిర్ణయించాక దళారులు లేకుండా నేరుగా కేరళకు బియ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు.