టీడీపీ నేతలకు సలాం కొట్టిన అధికారులు
కడప : కడపలో శనివారం జరిగిన 'అమృత్' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రోటకాల్ ఉల్లంఘించి టీడీపీ నేతలకు అధికారులు సలాం కొట్టారు. వేదికపై టీడీపీ నేతలను కూర్చోబెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజద్ బాషా కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.