బీజేపీలో చేరుతున్నా
టీటీడీ ధార్మిక పరిషత్ చైర్మన్ తాడిశెట్టి మురళీమోహన్
గుంటూరు ఈస్ట్: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం గుంటూరులో పాల్గొనే సభలో తాను బీజేపీలో చేరుతున్నట్టు టీటీడీ ధార్మిక పరిషత్ చైర్మన్, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ చెప్పారు. అరండల్పేటలోని ఎథినిక్ టుబాకో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తమ కుటుంబం క్రీయాశీలక రాజకీయాల్లో ఉండి జిల్లాతో మంచి అనుబంధం ఏర్పరుచుకుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పాలన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుండటం పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. సోమవారం సభలో వెంకయ్యనాయుడు గుంటూరును స్మార్ట్ సిటీగా తిర్చిదిద్దనున్నట్లు ప్రకటించనున్నారని తెలిపారు. అభిమానులంతా పాల్గొనాలని కోరారు. సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు మాధారాధ, అడపా కాశీవిశ్వనాధం, వంజరపు రత్నకుమారి, రేఖా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు డెరైక్టర్ జి.వి.యాదవ్, నారదాసు వీరమణీంద్ర తదితరులు పాల్గొన్నారు.