జానమద్ది విగ్రహావిష్కరణ
కడప: సాహితీవేత్త, సిపి బ్రౌన్ గ్రంథాలయ వ్యవస్థాపక కార్యదర్శి దివంగత జానమద్ది హనుమచ్ఛాస్త్రి విగ్రహాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర రావు ఈ ఉదయం ఇక్కడ ఆవిష్కరించారు. సిపి బ్రౌన్ గ్రంథాలయంలో జరిగిన జానమద్ది సాహితీ పీఠం పురస్కార ప్రధానం కార్యక్రమంలో న్యాయమూర్తి చలమేశ్వర రావు, ఏపి శాసన మండలి వైస్ చైర్మన్ బుద్ద ప్రసాద్ పాల్గొన్నారు.
సిపి బ్రౌన్ గ్రంథాలయ స్థాపనకు, బ్రౌన్ పుస్తకాల సేకరణకు జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనను బ్రౌన్ శాస్త్రి అంటారు. సాహిత్య రంగానికి, బ్రౌన్ గ్రంథాలయ స్థాపనకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
**