జగన్మోహనరావుకు జగన్ పరామర్శ

జగన్మోహనరావుకు జగన్ పరామర్శ - Sakshi


నందిగామ :   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి  విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావును సోమవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో జగన్మోమోహనరావుకు తీవ్ర గాయాలైన విషయం విదితమే.



ఈ నేపథ్యంలో విజ యవాడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో కాలుకు శస్త్ర చికిత్స చేయిం చుకుంటున్న జగన్మోమోహనరావు ఆరోగ్య పరిస్థితులను, ప్రమాదం జరిగిన తీరు వివరాలను  జగన్ అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకోవాలని జగన్  ఆకాంక్షించారని కార్యాలయ ఇన్‌ఛార్జి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ తెలిపారు.

 

త్వరగా కోలుకోవాలి : ఎమ్మెల్యే కల్పన

 

పామర్రు శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన సోమవారం మొండితోక జగన్మోహనరావును పరామర్శించారు. విజయవాడ సూర్యారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న ఆయనను కలిసి మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కల్పన ఆకాంక్షించారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top